దిశ దశ, పెద్దపల్లి:
ఏసీబీ అధికారుల దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన మునిసిపల్ ఏఈ ఇంట్లో సోదాల్లో లెక్కకు తేలని నగదు లభ్యం అయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అనంతరం ఏఈ సతీష్ ఇంట్లో తనిఖీలు చేపట్టగా రూ. 32 లక్షల నగదు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు.

