ఆత్మీయ సమ్మేళనంలో హాహా కారాలు…

ఇద్దరు మృతి… పలువురికి గాయాలు

కారేపల్లిలో అగ్నిప్రమాదం

దిశ దశ, ఖమ్మం:

బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా సుమారు పది మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఖమ్మం జిల్లా కారేపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరిపోయి ఓ పూరిగుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసె పూర్తిగా దగ్దం కాగా అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 10 మంది వరకు గాయపడ్డారని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. ఈ దుర్ఘటనలో కొంతమంది శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. ఆందోళనకరంగా ఉన్న వారిని మెడికల్ కాలేజీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరి కొద్దిసేపట్లో జరగనున్న ఆత్మీయ సమ్మేళనంలో అప్యాయతలు పంచుకోవల్సి ఉండగా అగ్నిప్రమాదం బీఆర్ఎస్ పార్టీలో విషాదం అలుముకుంది.