బీఆర్ఎస్ ఎంపీల నిరసన

దిశ దశ, న్యూఢిల్లీ:

ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టడంతో పాటు ఈ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఎంపీలు కోరారు. దేశ వ్యాప్తంగా అట్టుడికిపోతున్న మణిపూర్ అంశం గురించి ఉభయ సభల్లో చర్చించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఈ నిరసనలో ఎంపీలు సంతోష్ కుమార్, నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పార్థసారధి రెడ్డిలతో పాటు రాజ్యసభ నుండి సస్పెండ్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొన్నారు.