లంచం తీసుకుంటూ జీపీఓ ట్రాప్…

దిశ దశ, హుజురాబాద్:

ఓ రైతు నుండి లంచం తీసుకుంటున్న జీపీఓను ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ జీపీఓ శ్రీనివాస్ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఓ రైతు వద్ద లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు కరీంనగర్ రేంజ్ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆద్వర్యంలో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం జీపీఓను ట్రాప్ చేశారు. ఫినాప్తలిన్ పరీక్షలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచేందుకు సమాయత్తం అవుతున్నారు.