maoist party : బసవరాజ్ మృతికి అంతర్జాతీయ విప్లవ సంస్థల నివాళులు…

చైనా, టర్కీ మావోయిస్టుల ప్రకటన

దిశ దశ. దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ బీఆర్ దాదాతో పాటు మరో 26 మంది నక్సల్స్ ఎదురు కాల్పుల్లో మరణించిన ఘటనపై అంతర్జాతీయ విప్లవోద్యమ సంస్థలు నివాళులు అర్పిస్తూ ప్రకటన విడుదల చేశాయి. చైనా, టర్కీ దేశాల్లోని మావోయిస్టు పార్టీ విప్లవ సంస్థలు ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు) ప్రతినిధి జియాంగ్ గ్వాంకీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బసవరాజ్ మృతికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆయనతో పాటు మరో 26 మంది మావోయిస్టులు మరణించారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందామని, ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమం అంతిమ విజయం సాధిస్తుందని, మరణించిన వారి ఆశయాల స్పూర్తితో విప్లవకారులు ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాల సాథన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

టర్కీ మావోయిస్టు పార్టీ…

మరో వైపున టర్కీకి చెందిన మావోయిస్టు పార్టీ ( TKP/ML) కూడా మావోయిస్టు పార్టీ కార్యదర్శి బసవరాజ్, 26 మంది PLGA విప్లవకారులు ఎన్ కౌంటర్ లో చనిపోవడం పట్ల నివాళులు అర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటనతో పాటు మరో వీడియోను కూడా మీడియాకు విడుదల చేశారు టర్కి మావోయిస్టు పార్టీ విప్లవకారులు. దక్షిణాసియాలో మార్క్సిజం-లెనినిజం-మావోయిజం స్పూర్తితో భారతదేశంలో అంతర్యుద్దం సాగుతోందని దాని గాయాలతో శూన్యత నిండినప్పటికీ పోరాటంలో ధృడంగా ముందుకు సాగి విజయం సాధిస్తామని ఆశాభావంతో ఉన్నామని టర్కి మావోయిస్టు పార్టీ పేర్కొంది. కమ్యూనిస్టులు విత్తనాల లాంటి వారని, ప్రజలు భూమిలాంటి వారని మావో చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్లినా సానూకూలతను అందుకుంటామని తీరుతామన్నారు. భారతదేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం బలంగా నాటుకపోవడంలో కీలక పాత్ర వహించిన నాయకుల్లో బసవరాజ్ ఒకరని కొనియాడింది. తన 50 ఏళ్ల పోరాటంలో భారతదేశంలోని అణగారిన వర్గాల విముక్తి కోసం పోరాటం చేశారని, ఆయన జీవితాన్ని విప్లవోద్యమాలకే ధారపోశారని టర్కీ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. PLGA సైనిక వ్యూహాంతో సంస్థ బలోపేతానికి బసవరాజ్ విశేషంగా కృషి చేశారన్నారు. కగార్ అభియాన్ పేరిట 2023 నుండి భారత ప్రభుత్వం 10వేలకు పైగా సాయధ బలగాలను మోహరించిందని, భూమిని దోచుకోవడం, ఖనిజ సంపందను కార్పోరేట్ కంపెనీలకు ధారదత్తం చేసేందుకేనని ఆరోపించింది. బసవరాజ్ మరణంతో కుంగిపోకుండా ప్రతీకారంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
టర్కీ మావోయిస్టుల ప్రకటనకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

You cannot copy content of this page