దిశ దశ, దండకారణ్యం:
ఆంధ్రా ఒడిషా బార్డర్ లో ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు, బలగాలకు మధ్య జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం. రంపచోడవరం అటవీ ప్రాంతంలోని మారేడుమిల్లి సమీపంలోని కింటుకూరు వద్ద ఈ ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రా, ఒడిషా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC)కి చెందిన నక్సల్స్ కు, కూంబింగ్ జరుపుతున్న బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మరణించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ ఎదురు కాల్పుల్లో AOBSZC ఏరియా కమిటీ కార్యదర్శి ఉదయ్, ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణతో పాటు అంజూలు మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.