దిశ దశ, మెదక్:
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పని చేసిన స్టోర్స్ ఇంఛార్జి ఒకరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని గుర్తించిన సీబీఐ ఈ మేరకు కేసు నమోదు చేసింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో స్టోర్స్ ఇంఛార్జి, OFMK స్కేల్-4 ఆఫీసర్ గా గతంలో పని చేసిన అతనితో పాటు ఆయన భార్య పేరిట ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఈ నెల9న కేసు నమోదు చేసింది. మూడు రోజుల పాటు తెలంగాణాలోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అదికారుల బృందం 338 స్థిరాస్థులకు సంబంధించిన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకుంది. రూ. 2,11,60,582 విలువ ఉంటుందని సీబీఐ వెల్లడించింది.