10 వేలు లంచం తీసుకున్న ఏసీటీఓ

దిశ దశ, మహబూబ్ నగర్:

కమర్షియల్ ట్యాక్స్ అధికారి కమర్షియల్ గుట్టును రట్టు చేసింది తెలంగాణ ఏసీబీ. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగానే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ)ను రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. మహబూబ్ నగర్ ఏసీటీఓగా పని చేస్తున్న దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి, విత్తన, స్క్రాప్ దుకాణానికి సంబంధించిన జీఎస్టీ లైసెన్స్ జారీ చేసేందుకు రూ. 10 వేలు లంచం అడిగారు. బాధితుని నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఇక ఆ సమాచారం నో…

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏసీబీని ఆశ్రయించే బాధితుల వివరాలను వెల్లడించమని స్ఫష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా బాధితుల పేర్లను వెల్లడించమని తెలియజేశారు. ఈ మేరకు ‘ఎక్స్’’ ట్విట్టర్ వేదిగా ఏసీబీ అధికారులు ప్రకటన చేశారు.

acbACB RAIDSACB TELANGANAtelangana news