ఇద్దరి మృతి…?
దిశ దశ, జగిత్యాల:
కోరుట్ల పట్టణంలో దుర్ఘటన చోటు చేసుకుంది. శివార్లలోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో విద్యుత్ షాక్ తగలడంతో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు… పట్టణ శివార్లలోని బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వినాయకుని విగ్రహం తయారు చేసి మరో చోటకు తీసుకెళ్తున్న క్రమంలో కరెంటు స్తంబాలకు మీదుగా వెల్తున్న 33 కెవి విద్యుత్ వైర్లు తగలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు విద్యుత్ వైర్లను కర్రలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ షాకు కారణంగా గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో అల్వాల వినోద్, అల్వాల నితిన్, వెంకట్ రెడ్డి రాజేష్, నెల్లుట్ల బంటి, నెల్లుట్ల కృష్ణ, సాయినాథ్, మహారాష్ట్రకు చెందిన హనుమంతు, ఉత్తర ప్రదేశ్ కు రోషన్ ఆకాష్ రోషన్ లు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో వినోద్, సాయిలు చనిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.