`జన్మదిన వేడుకలో గంజాయి కిక్కు…

సింగర్ మంగ్లీతో పాటు పలువురిపై కేసు

దిశ దశ, హైదరాబాద్:

ప్రముఖ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. నిబంధనలకు విరుద్దంగా సాగిన ఈ పార్టీపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగళవారం అర్థరాత్రి జరిగిన పుట్టిన రోజు వేడుకలపై పోలీసులు దాడి చేశారు. సీఐ భూపాల్ శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు దాడులు చేయగా అనుమతులు లేకుండా సౌండ్ సిస్టం వినియోగించారని గుర్తించారు. మాదకద్రవ్యాల వినియోగం, ఎక్సైజ్ అనుమతి లేకుండా మద్యంతో విందు ఏర్పాటు చేయడం వంటి పలు చట్ట ఉల్లంఘనలకు సంబందించిన కేసు నమోదు చేశారు. వేదిక వద్ద దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడని గుర్తించిన పోలీసులు మాదక ద్రవ్యాల వినియోగంపై కూడా ఆరా తీస్తున్నారు. మంగ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు త్రిపుర రిసార్ట్స్ మేనేజర్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుండి డీజే సౌండ్ సిస్టంను స్వాధీనం చేసుకోగా, ఈ పార్టీకి నటి దివి, గీత రచయిత కాసర్ల శ్యామ్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయినట్టు పోలీసులు గుర్తించారు. వీరందరికి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page