Telangana police: చేతిలో లైట్… సర్ ప్రైజ్ విజిట్… అర్థరాత్రి సీపీ గౌష్ ఆలం ఏం చేశారంటే..?

దిశ దశ, కరీంనగర్:

సోమవారం అర్థరాత్రి వేళ రయ్ మంటూ ఓ వాహనం వచ్చి ఆగింది. చేతిలో టార్చ్ లైట్ పట్టుకున్న ఓ అధికారి చెక్ పోస్టును పరిశీలించేందుకు అక్కడకు చేరుకున్నారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు సీపీ స్వయంగా రంగంలోకి దిగారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సోమవారం అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు సీపీనే స్వయంగా కార్యరంగంలోకి దిగారు. సోమవారం అర్థరాత్రి కరీంనగర్ శివార్లలో ఏర్పాటు చేసిన పలు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది వాహనాలను ఎలా తనిఖీ చేస్తున్నారు. పశువులు వెల్తున్నాయా లేవా అని తెలుసుకునేందుకు ఏం చేస్తున్నారు అన్న విషయాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న పోలీసు యంత్రాంగం ప్రధాన రహదారులపై విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వాహనాలు వేగంగా వెల్తుంటాయని, స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన బారిగేట్లను పకడ్భందీగా ఏర్పాటు చేయాలని, రేడియం రిఫ్లెక్టెడ్ జాకెట్లు విధిగా ధరించాలని, టార్చ్ లైట్, ఎల్ఈడీ బ్యాటన్ వంటి పరికరాలను వినియోగించాలని సూచించారు. చెక్ పోస్టుల మీదుగా వెల్లే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాలకు వివరాలను ఖచ్చితంగా రిజిస్టర్ లో రికార్డ్ చేయాలని సీపీ ఆదేశించారు.

ఠాణాల్లోనూ…

కరీంనగరంలోని మూడు స్టేషన్లను కూడా సోమవారం అర్థరాత్రి విజిట్ చేసిన సీపీ గౌష్ ఆలం సిబ్బంది పనితీరును పరిశీలించారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది వివరాలతో పాటు డయల్ 100కు వస్తున్న కాల్స్ పై స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర సేవలందించేందుకు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే యంత్రాంగం అప్రతమత్తంగా వ్యవహరించాలని సీపీ ఆదేశించారు.

You cannot copy content of this page