లోకసభ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర

దిశ దశ, న్యూ ఢిల్లీ:

వచ్చే ఏడాది జరగనున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన రూట్ మ్యాప్ ను కూడా తయారు చేశారు. బుధవారం న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట చేపట్టనున్న ఈ బస్సు యాత్ర ఈస్ట్ టు వెస్ట్ వరకు సాగనుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 14 నుండి మార్చి 20 వరకు సాగనున్న ఈ యాత్ర మణిపూర్ నుండి ముంబాయి వరకు సాగుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా ఆమోదించారని, ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నం అయినట్టు తెలిపారు. భారత్ జోడో యాత్ర స్పూర్తితో నిర్వహించ తలపెట్టిన ఈ యాత్ర 6,200 కిలో మీటర్ల మేర సాగనుందని ఈ సందర్భంగా మహిళలు, యువత, అణగారిన వర్గాల ప్రజలను కలుస్తారని తెలిపారు. మణిపూర్ లో మొదలయ్యే ఈ బస్సు యాత్ర నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపి, ఎంపి, రాజస్థాన్, గుజరాత్ మహారాష్ట్రల వరకు సాగుతుందని తెలిపారు. ముంబాయిలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న ఈస్ట్ టు వెస్ట్ ‘భారత్ న్యాయ యాత్ర’ ముగుస్తుందన్నారు.

AICCBharat Nyay YatraCONGRESS NEWSpriyanka gandhirahul gandhi
Comments (0)
Add Comment