సమగ్ర శిక్ష అభియాన్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తీసుకోనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 37 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పలు విభాగాల్లో భర్తీ చేయ నున్నారు. వీటిలో కొన్ని పోస్టులకు డిగ్రీ పాస్ అయి ఉండాలి,
మరికొన్ని పోస్టులకు పదో తరగతి పాస్ అయితే చాలు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు జిల్లాల వారిగా SSA ఆఫీసులలో కేటాయించిన విధంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకొనే వారు 2023 జనవరి 17 నుంచి పెట్టుకోవచ్చు. దరఖాస్తులకు 2023 జనవరి 31 వరకు ఉంటుంది.

వయస్సు :
18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
ఈ నోటిఫికేషన్లో రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. SC, BC, ST అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు : ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి. SC, ST అభ్యర్థులు రూ. 500 చెల్లించాలిసి ఉంటుంది.
డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ధరఖాస్తు ఉండాలి.

ఎంపిక విధానం

రాత పరీక్ష వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ పై క్లిక్ చేసి తెలుసుకోండి https://cse.ap.gov.in/ .

Jobjob alertjob notificationjobes in apLatest Job