భాగ్యనగరంలో 5జీ సేవలు

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన నగరాలు హైదరాబాద్, బెంగుళూర్లలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించింది. ఈ రెండు నగరాల్లోని వినియోగదారులు అదనపు చెల్లింపులు లేకుండా 1 జీబీపీఎస్ ప్లస్ స్పీడ్‌తో అపరిమిత డేటాను పొందుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రిలయన్స్ జియో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాథ్‌ద్వారా (రాజస్థాన్) నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలను విజయవంతంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. జియో తన ట్రూ-5జీ బీటా సేవలను వెల్‌కం ఆఫర్‌ కింద దశలవారీగా విస్తరించే పనిలో నిమగ్నం అయింది. అయితే 5జీ సేవలపై వినియోగదారులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని జీయో కోరుతోంది. 5జీ సేవలను కంపెనీ 500 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ మధ్య ఇంటర్నెట్ స్పీడ్‌ని సబ్‌స్క్రైబర్లకు అందుస్తున్నామని, ఈ విధానం వల్ల వినియోగదారులు ఎక్కువ డేటాను సజావుగా ఉపయోగిస్తున్నారని జియో తెలిపింది. జియో అందించే ట్రూ-5జీ వెల్‌కమ్ ఆఫర్ కోసం వినియోగదారులు మినిమమ్ రూ. 239 ప్లాన్ కానీ అంతకంటే ఎక్కువతో కానీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

BengaluruHyderabadReliance Jioreliance jio 5g launchReliance Jio InfocommReliance Jio launches 5G services in Bengaluru and HyderabadTelecom industry