ఇండోనేషియా వెల్లనున్న మోడీ

భారత ప్రధాన మంత్రి విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే వారం వెల్లనున్న ప్రధాని జీ20 సదస్సుకు హాజరు కానున్నారని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు తెలిపారు. ఈ నెల 14 నుండి 16 తేదీల్లో ఇండోనేషియా రాజధాని బాలీలో పర్యటించనున్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఈ సదస్సుతో పాటు యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మన్ దేశాధినేతాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంతో ఆహార, శక్తి, భద్రత పరమైన సమస్యలతో పాటు అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న వాతవరణ మార్పులతో పాటు ఇతరాత్ర అంశాలపై చర్చించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు ఆయన జీ20 సదస్సుకు ప్రధాని హజరవుతున్నారు.

PM Modi To Visit Indonesia For G20 Summit Next Week