కరీంనగర్ వన్ డిపో మేనేజర్ పై వేటు..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ పై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అవకతవకలకు సంబంధించిన వ్యవహారంపై విచారించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కరీంనగర్ వన్ డిపో మేనేజర్ గా పని చేస్తున్న మల్లేశంను సస్పెన్షన్ లో ఉంచాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కామారెడ్డి డిపోలో ఉన్నప్పుడు కూడా అవకతవకలు చోటు చేసుకోగా రివర్షన్ ఇచ్చి భూపాలపల్లికి బదిలీ చేశారు. ఆ తరువాత డిపో మేనేజర్ గా కరీంనగర్ వన్ డిపోలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆర్టీసీ వర్గాలు మాత్రం డిపో మేనేజర్ మల్లేశంపై వేటుకు కారణాలు ఏంటీ అన్న వివారలపై స్పష్టత ఇవ్వడం లేదు.

karimnagar newsRTC MD SAJJANARtelangana newstg rtcTS RTC