లోయలపడ్డ బస్సు… నలుగురు మృతి…

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు ఘాటు రోడ్డులో ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది వ్యూ పాయింట్ వద్ద చెట్టు కొమ్మను తప్పించే క్రమంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. సుమారు వంద ఫీట్ల లోతు ఉన్న ఈ లోయలో బస్సు పడిపోవడంతో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టే పనిలో నిమగ్నం కాగా… బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణీకులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ap crime newsap newscrimecrime newsCRIME TODAYPaderu Ghat RoadRTC bus fell into valley