Telangana Acb: వేర్వేరు దాడుల్లో ఇద్దరు ఇంజనీర్ల ఎసీబీ ట్రాప్…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ ఏసీబీ అధికారులు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఇంజనీర్లను ఒక సీనియర్ అసిస్టెంటును రెడ్ హైండెడ్ గా ట్రాప్ చేశారు. లంచం తీసుకుంటున్న వీరిని ఏసీబీ కోర్టులలో ప్రవేశ పెట్టనున్నామని ప్రకటించారు.

ఎంబీ రికార్డ్ కోసం… 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాప్రా సర్కిల్ 1 పరిధిలో జరిగిన ఓ కాంట్రాక్టు పనిని మేజర్ మెంట్స్ బుక్ (MB)లో రికార్డులు నమోదు చేసేందుకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) బి స్వరూప లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సదరు కాంట్రాక్టర్ వద్ద రూ. 1.20 లక్షల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు.

కారు అద్దె బిల్లులోనూ..

కరీంనగర్ పంచాయితీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్నఏఈఈ, సీనియర్ అసిస్టెంట్లు చివరకు అద్దె కారు బిల్లు చెల్లించే విషయంలోనూ లంచం కోసం కక్కుర్తి పడ్డారు. ప్రైవేటు క్యాబ్ యజమానికి ఆరు నెలలకోసారి వచ్చే అద్దె తాలుకు డబ్బుల్లోనూ చేయి చాపడంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో మంగళవారం రూ. 8 వేలు లంచం తీసుకుంటున్న పంచాయితీరాజ్  క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో కెమికల్ టెస్ట్ కూడా నిర్దారణ కావడంతో ఇద్దరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని వెల్లడించారు. 

You cannot copy content of this page